నాకు భూమి లేదు.. పని మనిషిలా పని చేస్తా : గెల్లు శ్రీనివాస్‌

-

కరీంనగర్ జిల్లా : టీఆరెస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆసక్తి కర వ్యాఖ్యలు పెరిగాయి. తనకు టికెట్ ఇచ్చి హుజురాబాద్ ప్రజలు సేవ చేయమన్న కేసీఆర్ కి పాదాభివందనాలని.. తాను పేద కుటుంబం లో పుట్టిన బిడ్డనని పేర్కొన్నారు గెల్లు శ్రీనివాస్ యాదవ్. విద్యార్థి నాయకుడిగా ఉద్యమం లో పని చేశానని… సిఎం కేసీఆర్ ఉద్యమ స్పూర్తితో పని చేశానని గుర్తు చేశారు.

మొదటి నుంచి పార్టీ కోసం పని చేసినందుకు సీఎం కేసీఆర్ గుర్తించారని.. అందుబాటులో ఉండి మీకు సేవ చేస్తానని వెల్లడించారు. ఒక పని మనిషిలా పని చేస్తానని.. నాకు కేవలం రెండు గుంటల భూమి మాత్రమే ఆస్తి ఉందని పేర్కొన్నారు గెల్లు శ్రీనివాస్ యాదవ్. ఈ ఉప ఎన్నికల్లో తనను హుజురాబాద్ ప్రజలు ఆశీర్వదించాలని కోరారు గెల్లు శ్రీనివాస్. కాగా హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నిక టిఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ఇవాళ సిఎం కెసిఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news