అదిరే కేంద్రం ప్రభుత్వ స్కీమ్స్.. ప్రతి నెలా రూ.69,000 పొందచ్చు.. పూర్తి వివరాలివే..!

-

ఈ మధ్య కాలంలో ప్రతీ ఒక్కరు వారికి నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారు. ఇలా స్కీమ్స్ లో డబ్బులు పెడితే భవిష్యత్తు లో ఏ ఇబ్బంది ఉండదు. ప్రభుత్వ పెన్షన్ పొందాలని చాలా మంది అనుకుంటూ వుంటారు. దీని ద్వారా రిస్క్ కూడా ఉండదు. కచ్చితమైన నెలవారీ ఆదాయం వస్తుంది. రిటైర్మెంట్ తర్వాత చాలా మంది అదే అనుకుంటూ వుంటారు.

కేంద్రం తాజా బడ్జెట్‌లో పలు స్కీమ్స్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిట్ ని పెంచింది. వాటిల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ లో ఇక మీదట రూ. 30 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిట్ ని కూడా కేంద్రం పెంచేసింది. ఇక నుండి ఈ స్కీమ్ లో రూ. 9 లక్షలు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది వరకు ఈ లిమిట్ కేవలం రూ. 4.5 లక్షలు మాత్రమే ఉండేది. ఈ స్కీమ్‌ వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది.

కనుక ఇప్పుడు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో రూ. 15 లక్షలు పెట్టొచ్చు. అలానే మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో రూ. 4.5 లక్షలు పెట్టచ్చు. రూ. 15 లక్షలు పెడితే మూడు నెలలకు రూ. 30 వేల ని సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌ ద్వారా పొందొచ్చు. అంటే నెలకు రూ. 10 వేలను పొందొచ్చు. ప్రధాన్ మంత్రి వయ వందన యోజన స్కీమ్ విషయానికి వస్తే… దీనిలో రూ. 15 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు.

7.4 శాతం వ్డడీ ఇస్తున్నారు. ఇందులో రూ. 15 లక్షలు పెడితే నెలకు రూ. 9,250 వస్తాయి. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌లో కనుక మీరు రూ. 5 లక్షలు పెడితే నెలకు రూ. 10 వేలు వస్తాయి. అలానే మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో రూ. 4.5 లక్షలు పెడితే నెలకు రూ. 2,660 వస్తాయి. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో రూ. 15 లక్షలు పెడితే నెలకు రూ. 10 వేలు పొందొచ్చు.

పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో రూ. 4.5 లక్షలు పెడితే రూ. 2,660 వస్తాయి. ఇలా మీరు మొత్తం ప్రతీ నెలా రూ. 34,575 పొందొచ్చు. మీ భాగస్వామి పేరుపై కూడా ఇలా మీరు ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు రెట్టింపు డబ్బులొస్తాయి. ఆర్‌బీఐ బాండ్లలో రూ. 54 లక్షలు పెడితే ఏడాదికి రూ. 1.98 లక్షల వరకు వస్తాయి. నెలకి రూ. 33 వేలకు పైగా వస్తాయి. ఇలా రూ. 67 వేలకు పైగానే వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news