ఎస్బీఐ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్… రూ.10 వేల వరకు డిస్కౌంట్…!

-

స్టేట్ బ్యాంక్ తమ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పుడు ఎస్బీఐ కస్టమర్స్ అదిరిపోయే ఆఫర్స్ ని పొందొచ్చు. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. మీకు స్టేట్ బ్యాంక్ లో ఖాతా ఉందా..? అయితే మీకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎస్‌బీఐ యోనో ద్వారా టికెట్లు బుక్ చేసుకునే వారికి మంచి ఆఫర్స్ వున్నాయి. దీనిలో ఏకంగా రూ.10 వేల వరకు భారీ డిస్కౌంట్ వస్తోంది.

ఈ ఆఫర్ అందరికీ అందుబాటులో ఉండదు. కేవలం యోనో యాప్ ఉపయోగించే కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది గమనించండి. ఎస్‌బీఐ యోనో లో కస్టమర్లు రూ.10 వేల వరకు వీక్లి డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ఆఫర్ కేవలం ట్రావెల్ టికెట్లు బుక్ చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుంది.

అయితే ఎస్‌బీఐ యోనో ద్వారా ఈజీ మై ట్రిప్‌లో ఫ్లైట్, హోటల్స్, బస్ టికెట్లను బుక్ చేసుకుంటే రూ.10 వేల వరకు వీక్లి డిస్కౌంట్ వస్తుంది. ఈ విషయాన్నీ ఎస్బీఐ ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. ఈ ఆఫర్ పొందాలని భావించే వారు రూపేఈఎంటీ అనే కోడ్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. కాబట్టి ఎస్బీఐ కస్టమర్స్ ఈ సూపర్ ఆఫర్ ని ఈ కోడ్ తో ఉపయోగించుకోవచ్చు. దీని వలన పది వేల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news