బ్రేకింగ్: ఆ ప్రాంతాలే జీహెచ్ఎంసీ టార్గెట్…?

-

హైదరాబాద్ లో కరోనా కేసులను కట్టడి చేయడానికి బల్దియా అధికారులు తీవ్ర స్థాయిలో కష్టపడుతున్నారు. ప్రజలు ఇబ్బంది పడకుండా కరోనా కేసులను కట్టడి చేసే విధంగా సమర్ధవంతంగా చర్యలు చేపడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే బల్దియా అధికారులు కొన్ని ప్రాంతాలను టార్గెట్ చేసారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మార్కెట్లలో లో జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంది.

రద్దీ ప్రాంతాలు, వీకెండ్ మార్కెట్లపై బల్దియా ఫోకస్ చేసింది. సోషల్ డిస్టెన్స్, మాస్కు ధరించాలంటు ఫ్లకార్డులు – మైకుల ద్వారా అవగాహన కల్పిస్తుంది. బస్తీలు, వారాంతపు సంతల వద్ద జిహెచ్ఎంసి సిబ్బంది స్ప్రేయింగ్ చేస్తున్నారు. నిన్నటితో తొలివిడత ఫీవర్ సర్వే పూర్తి చేసిన జిహెచ్ఎంసి… త్వరలో ప్రభుత్వానికి నివేదిక కూడా అందిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news