బ్రేకింగ్‌: భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌.. వెండి కూడా

-

మూడు రోజులుగా స్టిరంగా ఉన్న బంగారం ధ‌ర ఈ రోజు భారీగా పెరిగింది. మంగళవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 170 రూపాయలు పెరిగింది. దీంతో 39,750 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 160 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 36,440 రూపాయలకు చేరింది. కాగా, వెండి ధర కూడా స్వల్ప పెరుగుదల నమోదు చేసింది. వెండి కేజీకి 10 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 46,860 రూపాయల వద్ద నిలిచింది.

ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 150 రూపాయలు పెరిగింది. దీంతో 38,400 రూపాయల వద్దకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 150 రూపాయల పెరుగుదల నమోదు చేసి 37,200 రూపాయలయింది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి పది రూపాయలు పెరిగింది. దీంతో వెండి కేజీకి 46,860 రూపాయల వద్దకు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news