బిగ్ బ్రేకింగ్‌: ప‌రుగులు పెడుతున్న బంగారం ధ‌ర‌.. వెండి కూడా..

-

నిన్న స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర ఈ రోజు పైపైకి ప‌రుగులు పెడుతుంది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర పైకి కదిలింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ఏకంగా రూ.610 పెరిగింది. దీంతో పసిడి ధర రూ.37,930కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.660 పెరుగుదలతో రూ.41,380కు ఎగసింది. బంగారం ధర పరుగులు పెడితే వెండి ధర కూడా పసిడి బాటలోనే నడిచింది. కేజీ వెండి ధర రూ.50 పెరిగింది. దీంతో ధర రూ.49,400కు చేరింది.

ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది.10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.650 ఎగసింది. దీంతో ధర రూ.38,750కు చేరింది. అదే స‌మ‌యంలో 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.850 పరుగులు పెట్టింది. దీంతో బంగారం ధర రూ.39,950కు చేరింది. ఇక కేజీ వెండి ధర కూడా రూ.50 పెరిగింది. దీంతో ధర రూ.49,400కు ఎగసింది.

Read more RELATED
Recommended to you

Latest news