బ్రేకింగ్‌: ప‌రుగులు పెడుతున్న బంగారం ధ‌ర‌.. వెండి కూడా..

-

నిన్న భారీగా దిగొచ్చిన బంగారం ధ‌ర ఈ రోజు భారీగా ప‌రుగులు పెడుతోంది. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర శుక్రవారం భారీగా పెరిగింది. రూ.500 ర్యాలీ చేసింది. దీంతో బంగారం ధర రూ.38,380 నుంచి రూ.38,880కు పరుగులు పెట్టింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా పైకి కదిలింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.510 పెరుగుదలతో రూ.41,900 నుంచి రూ.42,410కు చేరింది. బంగారం ధర పరుగులు పెడితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.610 ర్యాలీ చేయ‌డంతో ధర రూ.49,200 నుంచి రూ.49,810కు ఎగసింది.

ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.500 పెరిగింది. దీంతో ధర రూ.39,700కు ఎగసింది. అదే స‌మ‌యంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.500 పెరిగింది. దీంతో రూ.40,900కు ర్యాలీ చేసింది. ఇక కేజీ వెండి ధర రూ.610 పెరుగుదలతో రూ.49,810కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news