బ్రేకింగ్‌: పైకెగ‌సిన బంగారం ధ‌ర‌.. వెండి కూడా పైపైకే..!

-

మూడు రోజులుగా త‌గ్గుద‌ల న‌మోదు చేస్తున్న బంగారం ధ‌ర‌.. ఈ రోజు పైకి క‌దిలింది. హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం 22 క్యారెట్ల బంగారం ధర భారీగా పెరిగింది. పసిడి ధర 10 గ్రాములకు ఏకంగా రూ.400 పరుగులు పెట్టింది. దీంతో రూ.38,840 నుంచి రూ.39,240కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా ధగధగలాడింది. రూ.400 పరుగులు పెట్టింది. దీంతో పసిడి ధర 10 గ్రాములకు రూ.42,370 నుంచి రూ.42,770కు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా అదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.500 పెరిగింది.

దీంతో ధర రూ.49,000 నుంచి రూ.49,500కు చేరింది. ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.450 ఎగసింది. దీంతో ధర రూ.41,300కు చేరింది. అదే స‌మ‌యంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.450 పెరుగుదలతో రూ.40,100కు పరుగులు పెట్టింది. ఇక కేజీ వెండి ధర రూ.49,500కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news