శ్రీ మహంకాళీ అమ్మవారికి బంగారు బోనం…!

-

తెలంగాణ ప్రజలు ఎంతో గొప్పగా జరుపుకునే పండుగలలో బోనాలు కూడా ప్రముఖ స్థానం కలిగినవి. అయితే ఈసారి కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎంతో గొప్పగా జరుపుకునే బోనాల సమర్పణ కార్యక్రమం చాలా నిరాడంబరంగా కొనసాగుతున్నాయి. ఎక్కువ మంది భక్తులకు దర్శన భాగ్యం లేకుండా బోనాలను నిర్వహిస్తున్నారు ఆలయ కమిటీ సభ్యులు.

bangaru bonam
bangaru bonam

ఈ నేపథ్యంలో పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళీ అమ్మవారి దేవాలయంలో నేడు బోనాలు అత్యంత నిరాడంబరంగా కొనసాగాయి. నేటి తెల్లవారుజాము నుంచే కమిటీ సభ్యులు, అలాగే ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేకంగా బోనాలను సమర్పించారు. ఆ తర్వాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాలు సమర్పించే భాగంగా మహంకాళి అమ్మవారి దేవాలయం కమిటీ తరఫున కమిటీ చైర్మన్ లక్ష్మీనారాయణ గౌడ్ తన కుటుంబ సభ్యులతో అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. వీటితో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంపిన పట్టు వస్త్రాలను కూడా అమ్మవారికి సమర్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news