గుడ్ న్యూస్ : బంగారం ధరలు స్థిరంగా.. వెండి మాత్రం !

-

గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధరలు ఈ రోజు మాత్రం నిన్నటి ధరకే ఫిక్స్ అయ్యాయి. ఇక హైదరాబాద్‌ సహా విశాఖ పట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర మొన్న 370 రూపాయల ధర పెరిగింది. ఇక నిన్నటికీ ఎరోజుకీ కేవలం పది గ్రాములకి పది రూపాయల తేడా మాత్రమె ఉంది. దీంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹51,930కి పెరిగింది. అలానే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹47,610కి పెరిగింది.


అయితే ఢిల్లీ మార్కెట్‌ లో మాత్రం ఈ రేట్ మొన్న భారీగా 1,370 మేర పెరిగింది. 24 క్యారెట్ల బంగారంపై రూ.1,370 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.54,150కిచేరింది. ఇక అక్కడ కూడా గ్రాముకి రూపాయి చొప్పున పెరిగింది. ఇక నిన్న బాగా తగ్గిన వెండి ధరలు ఈ రోజు మాత్రం బాగా పెరిగాయి. తాజాగా మార్కెట్‌లో వెండి ధర రూ.1,300 మేర పెరిగింది దీంతో ప్రస్తుతం 1 కేజీ వెండి ధర రూ.62,500కు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news