మ‌హిళ‌ల‌కు షాక్‌.. మ‌రోసారి పెరిగిన బంగారం ధ‌ర‌లు

-

బంగారం.. ప్ర‌పంచంలోనే అత్యంత విలువైన వ‌స్తువు. ప్ర‌పంచంలో ఏ మూల‌కు పోయినా.. బంగారం ధ‌ర‌లు భారీగానే ఉంటాయి. దీనికి ముఖ్య కార‌ణం.. బంగారానికి ఉన్న డిమాండే. అయితే.. ఈ బంగారం ధ‌ర‌లు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటాయి. ఇక మ‌న దేశంలో… క‌రోనా విజృంభించిన‌ప్ప‌టి నుంచి… విప‌రీతంగా పెరిగి పోతున్నాయి బంగారం ధ‌ర‌లు.

ఇప్ప‌టి కే తెలుగు రాష్ట్రాల‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం రూ. 49 వేల మార్క్ చాలా రోజుల కింద‌టే దాటేసింది. అయితే ఈ రోజు పెర‌గిన ధ‌ర‌ల‌తో దేశం లో ని ప్ర‌ధాన నగ‌రాల్లో బంగారం ధ‌ర‌లు ఎలా ఉన్నాయే చూద్దాం. తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.10 పెరిగి రూ. 44, 960 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.10 పెరిగి రూ. 49050 కి చేరుకుంది. బంగారం ధ‌ర‌లు పెర‌గ‌గా… వెండి ధ‌ర‌లు మాత్రం సామాన్యుల‌కు ఊర‌ట‌నిచ్చాయి. కిలో వెండి ధ‌ర రూ.700 త‌గ్గి.. రూ.64800 కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news