స్వల్పంగా పెరిగిన పసిడి.. ఈరోజు ధరలు ఇవే !

-

దీపావళి సందర్భంగా నిన్న బంగారం ధరలు గట్టిగానే పెరుగుతాయని భావించారు. ఈ రోజు మాత్రం నిన్నటి ధర కంటే స్వల్పంగా పెరిగాయి. దీపావళి పండుగ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది కాస్త చేదు వార్త అనే చెప్పాలి. నిజానికి గత ఐదు రోజులుగా బంగారం ధర పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది. బంగారం ధర పెరిగితే వెండి ధర నామ మాత్రంగా తగ్గింది. హైదరాబాద్‌ సహా విశాఖ పట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.


24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹52,050కి పెరిగింది. అలానే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹47,710కి పెరిగింది. అయితే ఢిల్లీ మార్కెట్‌ లో కూడా ఈ రేట్ స్వల్పంగానే నమోదైంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹54,280కి చేరింది. ఇక కేజీ వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. అయితే నిన్నటి మీద కేజీ రెండు వందల రూపాయలు పెరగడంతో కేజీ వెండి ధర ₹63600.00 రూపాయల వద్దకు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news