రైతులకు గుడ్ న్యూస్.. త్వరలోనే పాస్ పుస్తకాలు పంపిణీ

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ రెవెన్యూ శాఖ పని తీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ శాఖ ప్రస్తుత పరిస్థితి పై సీఎం చర్చించారు. అనంతరం మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాతో మాట్లాడారు. త్వరలోనే రైతులకు కొత్త పాస్ పుస్తకాలు వస్తాయని తెలిపారు.  కొత్త పాస్ పుస్తకాల్లో క్యూ ఆర్ కోడ్ ముద్రణ ఉంటుంది. 

యజమాని, భూమి వివరాలతో కొత్త పాస్ పుస్తకాలు అందుబాటులోకి రానున్నాయి.  దాదాపు రూ.20కోట్ల ఖర్చుతో కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వనున్నట్టు తెలిపారు మంత్రి అనగాని ప్రసాద్. ముఖ్యంగా భూములపై అత్యధికంగా ఫిర్యాదులు వస్తున్నాయి.  గత ప్రభుత్వ హయాంలో అసైన్డ్ ల్యాండ్ ల అక్రమాలు చోటు చేసుకున్నాయి. భూసర్వే పేరుతో 77 లక్షల రాళ్లు పాతారని అదికారులు చెప్పారు. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఎన్నివేల ఎకరాల వరకు వెళ్లిందని ఆరా తీస్తున్నాం. ఐదేళ్లలో తీసుకొచ్చిన చట్టాలు.. అవి దుర్వినియోగం అయిన తీరుపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షలో చర్చించినట్టు వెల్లడించారు మంత్రి అనగాని. కొత్త పాస్ పుస్తకం చూడగానే రైతుల్లో సీఎం తెలిపినట్టు చెప్పారు. 

Read more RELATED
Recommended to you

Latest news