రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ నగదు జమ తేదీ ఖరారు

-

మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ రైతులకు శుభవార్త అందించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను రైతుల అకౌంట్లోకి జమ చేసేందుకు తేదీని ఖరారు చేశారు.

ఈ నెల 18న ప్రధాని మోడీ 17వ విడత సమ్మాన్ నిధి విడుదల కానుంది. ప్రధాని మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి ఈ నెల 18న నరేంద్ర మోడీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించబోతున్నారు. ఈ పర్యటనలో భాగంగా రైతుల ఖాతాలో నగదు జమ అవుతుంది.

లక్షలాదిమంది రైతులకు పెట్టుబడి కోసం ఇబ్బంది పడకుండా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రైతులకు అందిస్తోంది.ప్రస్తుతం ఖరీఫ్ సమయం ప్రారంభం కావడంతో రైతుల పెట్టుబడికి ఇది బాగా ఉపయోగపడుతుంది అని ప్రభుత్వం భావిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news