రైతులకు గుడ్ న్యూస్ …..రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ నిధులు ఎప్పుడంటే?

-

దేశంలోని రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. రైతులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం-కిసాన్‌ పథకం 16వ విడత నిధుల విడుదలకు తేదీ ఖరారు అయినట్లు తెలుస్తోంది.ఫిబ్రవరి 28 వ తేదీన రూ.2వేలు చొప్పున రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కానున్నాయి. మహారాష్ట్రలోని యావత్మాల్‌ జిల్లా నుంచి ప్రధాని ఈ నిధుల్ని విడుదల చేయనున్నట్లు పీఎం కిసాన్‌ అధికారిక ‘ఎక్స్‌’ (ట్విటర్‌) ఖాతాలో వెల్లడించారు. పీఎం కిసాన్‌ నిధులు ఖాతాల్లోకి జమ కావాలంటే అర్హులైన రైతులు ఎన్‌పీసీఐ, ఆధార్‌తో అనుసంధానించిన బ్యాంకు ఖాతాను కలిగి ఉండడంతోపాటు ఇ-కేవైసీ చేసి ఉండాలి.

ఒకవేళ పీఎం కిసాన్‌ పథకానికి సంబంధించిన స్టేటస్, పీఎం కిసాన్‌ జాబితాలో మీ పేరు ఉందో, లేదో చూడాలన్నా https://pmkisan.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్‌ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన వివరాలు పొందడానికి రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌/ ఆధార్‌ నంబర్‌ ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. పీఎం కిసాన్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా వివరాలను తెలుసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే 155261/011-24300606 హెల్ప్‌లైన్లను కూడా సంప్రదించొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news