కేసీఆర్ ను జైలుకు పంపడమే నా లక్ష్యం : ఎమ్మెల్యే కోమటిరెడ్డి

-

బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ సమాధి అయిందని ఆ పార్టీలో ఎవరూ మిగలరని అన్నారు.ఎమ్మెల్యే హరీశ్ రావు సైతం బీజేపీలోకి వెళ్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను జైలుకు పంపడమే నా మరో లక్ష్యం అని ఆయన హాట్ కామెంట్స్ చేశారు.

శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి జైలుకు వెళ్లే వ్యక్తి..జైలుకు వెళ్లేవారిని మేం కాంగ్రెస్ లో చేర్చుకోమని అన్నారు. కాగా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. త్వరలోనే మరికొంత మంది బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి చేరేందుకు రెడీ ఉన్నారనే ప్రచారం జరుగుతున్నది. మరో వైపు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు ఆ పార్టీని వీడి ఇతర పార్టీలో చేరుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version