ప్రభుత్వం పాస్ చేసిన ఇంటర్ విద్యార్థులకు ఇంప్రూవ్ మెంట్ అవకాశం..!

-

ఇంటర్ ఫలితాలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఆన్లైన్ క్లాసుల కారణంగా నష్టపోయామని తమను పాస్ చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు సైతం చేసుకున్నారు. దాంతో ప్రభుత్వం ఫెయిల్ అయిన విద్యార్థులు అందర్నీ 35శాతం మార్కులతో పాస్ చేస్తున్నట్టు ప్రకటించింది. అంతే కాకుండా ఇప్పుడు విద్యార్థులకు మార్కులు పెంచుకునే అవకాశాన్ని కూడా ఇంటర్ బోర్డ్ కల్పించింది.

త్వరలోనే ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలతో పాటు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంప్రూవ్ మెంట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. మార్కులు పెంచుకోవాలి అనుకునేవాళ్లు ఇంప్రూవ్ మెంట్ రాసుకోవచ్చు అని మంత్రి సబితా ఇంద్రరెడ్డి తెలిపారు. అంతే కాకుండా ఇప్పటికే కొంతమంది రివాల్యూయేశన్ కు అప్లై చేసుకున్నారు. ఒకవేళ వాళ్ళు రివాల్యూయేషన్ క్యాన్సిల్ చేసుకుంటే వారికి డబ్బులు తిరిగి ఇస్తామని కూడా ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news