ప్రైవేటు ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్‌..!

-

మీరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారా..? అయితే మీకు అదిరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఈపీఎఫ్ పింఛన్‌ను పెంచాలంటూ ఉద్యోగ సంఘాలు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు వారి డిమాండ్ నెరవేరే రోజు అతి దగ్గరలోనే ఉన్న‌ట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ప్రస్తుతం వెయ్యి రూపాయలుగా ఉన్న ఈపీఎఫ్ పెన్షన్ ఇకపై రూ.6 వేలకు పెరగనుంది. ఈ మేరకు కేంద్రం నిర్ణయించినట్టు సమాచారం. వచ్చే నెల 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని పొందుపరిచినట్టు తెలుస్తోంది.

దీంతోపాటు గతంలో అమల్లో ఉన్న కమ్యుటేషన్ పద్ధతిని తిరిగి తీసుకురావాలని కూడా కేంద్రం యోచిస్తున్నట్టు సమాచారం. ఇది అమల్లోకి వస్తే రిటైర్మెంట్ సమయంలో పీఎఫ్‌తోపాటు పెన్షన్‌లోని కొంత మొత్తాన్ని కూడా తీసుకునే వీలు చిక్కుతుంది. అయితే, అలా తీసుకున్న పక్షంలో నెలవారీ పెన్షన్‌ 15 ఏళ్లపాటు మూడోవంతుకు తగ్గిపోతుంది. ఈ పద్ధతిని అమల్లోకి తీసుకొస్తే 6.5 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news