శ్రీవారి భక్తులకు శుభవార్త..25 టికెట్లు నేడు విడుదల !

-

తిరుమల శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇవాళ ఆన్ లైన్ లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి. ఇవాళ ఏకంగా.. ఏప్రిల్ మాసానికి సంబంధించిన టికెట్లు, రేపు మే మాసం….ఎల్లుండి జూన్ మాసంకు సంభందించిన టికెట్లను విడుదల చెయ్యనుంది టిటిడి పాలక మండలి.


సోమవారం నుంచి బుధవారం వరకు రోజుకు 30 వేల చొప్పున…. గురువారం నుంచి ఆదివారం వరకు రోజుకి 25 వేల చొప్పున టిక్కెట్లు విడుదల చెయ్యనుంది టిటిడి పాలక మండలి. 3 నెలలకు సంభందించి 25 లక్షల టికెట్లు విక్రయం ద్వారా టిటిడి ఖజానాకు ఏకంగా రూ.75 కోట్ల రూపాయలు జమ కానున్నాయి. ఇక టీటీడీ పాలక మండలి.. తాజా ప్రకటన తో… భక్తులు ఫుల్‌ ఖుషీ లో ఉన్నారు. కాగా.. నిన్న శ్రీవారిని 72,265 మంది భక్తులు దర్శించుకు కోగా.. తలనీలాలు 34,517 మంది భక్తులు సమర్పించారు. ఇక హుండీ ఆదాయం రూ.4.59 కోట్లకు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news