విద్యార్థులకు శుభవార్త.. త్వరలోనే పది పాసైన వారికి..?

-

 

కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి విద్యార్థులందరిని పాస్ చేస్తూ తెలంగాణసర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఇప్పటికే షార్ట్ మెమోలు జారీ చేసింది ప్రభుత్వం. ప్రస్తుతం 10 పాసైన వారికి త్వరలోఒరిజినల్ మెమోలు పంపిణీ చేయనుంది. ఇక ఈ మెమోలు పంపిణీ చేయడానికి ముందు ఈ మెమో లో పేరు పుట్టిన తేది వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అని పరీక్షించు కోవడానికి అవకాశం కల్పించింది.

మెమోల్లో అక్షర దోషాలు సరిదిద్దుకోవడాని కి మరో వారం రోజుల పాటు అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు, ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ ఒరిజినల్ మెమోలను స్కూల్ల వారిగా విద్యార్థులందరికీ పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. కాగా ఈ ఏడాది పది పరీక్షలు రద్దు చేయడంతో అందరూ విద్యార్థులు ఉత్తీర్ణులైన విషయం తెలిసిందే, దాదాపుగా అన్ని పాఠశాలలో 100% ఉత్తీర్ణత నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version