మహిళలకు గుడ్ న్యూస్.. ఎన్నికల కోడ్ తరువాత మహాలక్ష్మీ స్కీమ్..!

-

మహిళలకు శుభవార్త అనే చెప్పాలి. ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత మహాలక్ష్మీ స్కీమ్ వర్తిస్తుందని పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీ కృష్ణ తెలిపారు. ఇవాళ రామగుండంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్లుగా నిరుద్యోగుల తెలంగాణగా మారింది.

ముఖ్యంగా సింగరేణిలో మద్యం బాటిళ్లు పంపిణీ ఎక్కువగా చేశారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదన్నారు. పదేళ్లు అనుభవించిన నరకం మళ్లీ అనుభవించాల్సి వస్తుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే.. రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణను అభివృద్ధిలో వెనక్కి నెట్టిందని పేర్కొన్నారు. తెలంగాణలో కేసీఆర్ ఏ మొఖం పెట్టుకొని ఓట్లు వేయాలి.. రాష్ట్రానికి కేసీఆర్ ఏం చేశాడని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఇప్పటికే 5 నెరవేర్చిందని.. ఎన్నికల కోడ్ తరువాత మహాలక్ష్మీ స్కీమ్ పథకం అమలు చేస్తామని తెలిపారు. రాహుల్ గాంధీ నిర్ణయం మేరకు ప్రతీ పేదింటి మహిళకు రూ.2,500 మహాలక్ష్మీ స్కీమ్ కింద అందజేస్తామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news