సంబరాల రాంబాబు లాటరీ పేరుతో దోచేస్తుంటే సీఎంకు తెలియదా? – గోరంట్ల బుచ్చయ్య

-

సంక్రాంతి సంబరాల పేరుతో జగన్ రాష్ట్రానికి విష సంస్కృతి తీసుకొచ్చాడని ఆరోపించారు టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. సంస్కృతి సంప్రదాయాలకు నెలవైన రాష్ట్రాన్ని జగన్ జూదశాలగా మార్చాడని మండిపడ్డారు. జూదాలు, కోడిపందేలు, గుండాట ముసుగులో వైసీపీ నేతలు రూ. 300 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.

gorantla bucchiah chowdar comments
gorantla bucchiah chowdar comments

జీవోనెం-01, సెక్షన్ 30 అమల్లో ఉంటే, సంక్రాంతి సంబరాల్లో దోపిడీ ఎలా జరిగిందో డీజీపీ చెప్పాలన్నారు. గన్నవరంలో తెల్లారే వరకు నగ్ననృత్యాలు జరిగినా పోలీసులకు కనిపించలేదా? అని ప్రశ్నించారు గోరంట్ల బుచ్చయ్య. గోవా నుంచి ప్రవీణ్ చికోటి వచ్చి గుడివాడలో కేసినో పెడితే పోలీసులేం చేస్తున్నారు..? అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం ముగ్గుల పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ఎడ్లపోటీలు నిర్వహిస్తే, జగన్ జూదాలు, నగ్న నృత్యాలు, గుండాట, కోడిపందేలు నిర్వహించాడని మండిపడ్డారు.

సంబరాల రాంబాబు లాటరీ పేరుతో దోచేస్తుంటే సీఎంకు తెలియదా? అని దుయ్యబట్టారు. ప్రజలు నాశనమైనా, సంస్కృతి సంప్రదాయాలు మంట గలిసినా పర్లేదు.. నీ జేబు నిండితే చాలా జగన్..? అని విమర్శలు సంధించారు. రాష్ట్రంలో టూరిజం లేదని.. ఎటుచూసినా పేకాట.. గుండాట.. కేసినోలేనని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news