బ్రేకింగ్ : పోలీస్ బూట్లను ముద్దాడిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్.. వైర‌ల్ వీడియో

-

పోలీసులపై మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు బూట్లను శుభ్రం చేసి, వాటిని ముద్దాడారు. పోలీసు బూట్లంటే యుద్ధంలో ఆయుధాలని, పోలీసులను తిట్టినందుకే జేసీ పతనావస్థకు చేరారని అన్నారు. దేశ రక్షణకు పోలీసులు ప్రాణాలు అర్పిస్తున్నారని.. అలాంటి పోలీసులపై జేసీ దివాకర్‌రెడ్డి జుగుప్సాకరంగా మాట్లాడరని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అయ్యే సత్తా ఉన్నప్పటికీ చాలా మంది పోలీసు వ్యవస్థలో పనిచేయాలన్న నిబద్ధతతో అక్కడే కొనసాగుతున్నారని గోరంట్ల మాధవ్ అన్నారు. తాను జస్ట్‌ ట్రయిల్‌ చూపించానని, ఎంపీని అయ్యానని, ఈ విషయాన్ని జేసీ గుర్తుంచుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో పోలీసులపై వ్యాఖ్యలు చేస్తే జేసీని ప్రజలు బజారుకీడ్చారని.. రాజకీయ సమాధి కట్టారన్నారు. జేసీ మాట్లాడుతుంటే దుర్యోధనుడిలా టీడీపీ అధినేత చంద్రబాబు నవ్వారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news