బిగ్ బ్రేకింగ్ : గవర్నర్ బండారు దత్తాత్రేయ కార్ కు యాక్సిడెంట్

-

తెలంగాణలో రహదారులు రక్తమోడుతున్నాయి. నిన్న వేర్వేరు ఘటనలలో ఒక్క హైదరాబాద్ లోనే ఎనిమిది మంది చనిపోయారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది.  హైదరాబాద్ నుండి నల్గొండకు వెళ్తుండగా చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామ శివారులోని జాతీయ రహదారిపై దత్తాత్రేయ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కకుకి దూసుకెళ్లింది.

అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కొద్దిసేపటి తర్వాత మరో వాహనంలో నల్గొండకు గవర్నర్ దత్తాత్రేయ బయల్దేరి వెళ్ళారు. తెలంగాణలో సీనియర్ బీజీపీ నేతగా ఉన్న ఆయనను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఎంపిక చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. అయితే కొద్ది రోజులుగా ఆయన తెలంగాణలో పర్యటిస్తున్నారు. మరికాసేపట్లో పట్టణంలోని గుండగోని మైసయ్య కన్వెన్షన్ హాల్ లో గవర్నర్ దత్తాత్రేయకి జరగనున్న పౌర సన్మానం.

Read more RELATED
Recommended to you

Latest news