నేడు యాదాద్రిలో గవర్నర్‌ తమిళిసై పర్యటన

-

రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇవాళ యాదాద్రిలో పర్యటించనున్నారు. ఉదయం 7.45 గంటలకు హైదరాబాద్​లోని రాజ్​భవన్ నుంచి తమిళిసై బయలుదేరనున్నారు. 10.45 గంటలకు యాదగిరిగుట్టకు చేరుకోనున్నారు. అక్కడ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం 11.45 గంటలకు తిరిగి హైదరాబాద్​ పయనమవనున్నారు.

గవర్నర్ పర్యటనను పురస్కరించుకుని యాదాద్రి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేయనున్నారు. ఓవైపు భక్తులకు ఇబ్బందులు కలగకుండా.. మరోవైపు గవర్నర్​ సందర్శన ప్రశాంతంగా ముగిసేలా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇటీవలే గవర్నర్ యాదాద్రిని సందర్శించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నందున మరోసారి స్వామి వారి దర్శనం చేసుకునేందుకు ఇవాళ గవర్నర్ యాదాద్రికి వెళ్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news