టీటీడీ బోర్డు నవ్వుల పాలైంది.. శ్రీవారిని అంగట్లో అమ్మొద్దు: స్వామి గోవిందానంద

-

తిరుప‌తి దేవ స్థానంపై కిస్కింద హనుమ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు వ్యవస్థాపకులుకిస్కింద హనుమ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు వ్యవస్థాపకులు గోవిందానంద సరస్వతీ స్వామీజీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శ్రీవారిని అంగట్లో అమ్మొద్దని.. శ్రీవారిని రోడ్డు‌మీద పెట్టి స్వామి సేవలను కోటి రూపాయలకు అమ్ముతున్నారా..? అని నిల‌దీశారు. శ్రీవారి సేవలు వెల కట్టలేనిదని.. సేవలను టిక్కెట్ల రూపంలో అమ్మి హాస్పిటల్ కట్టాలంటే అది సమంజసం కాదని మండిప‌డ్డారు.

స్వామి పేరు చెప్పి సొమ్ము ఒకడిది..సోకు మరొకడిది అనే‌విధంగా టిటిడి వ్యవహరిస్తోందని.. సేవల అమ్మకంపై టిటిడి‌ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే టిటిడి‌ బోర్డు నవ్వుల పాలైందని.. ఈవో‌ పేరిట ప్రభుత్వాలే ఆలయాలే స్ధిర నివాసం ఏర్పరచుకుందన్నారు. ఆలయాలను కబ్జా చేసుకుని నిధులను తమ ప్రభుత్వం ఎజెండాలకు వినియోగించుకోవడం చట్ట విరుద్ధమ‌ని.. జియ్యర్ స్వాములు ఏమి చేస్తున్నారు..? అని మండిప‌డ్డారు. ఆలయాల్లో భాధ్యత నిర్వర్తిస్తున్న మతపరమైన అంశాల జోలికి ప్రభుత్వం ఎట్టి పరిస్ధితిలోనూ వెళ్ళరాదు..? టిటిడికి ఇఓ అవసరం లేదు..? సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news