ఆర్టీసీపై మరో కమిటీ.. సమ్మె విరమణకు ఛాన్స్..!

-

నిన్నటి వరకూ చర్చల్లేవ్ అంటూ భీష్మించుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కాస్త మెత్తబడ్డట్టు తెలుస్తోంది. చర్చలు జరపాల్సిందే అని హైకోర్టు తేల్చి చెప్పడంతో చర్చలకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎట్టకేలకు తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె ఓ కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

అయితే ఒక్క కండిషన్ మాత్రం పెడుతున్నారు కేసీఆర్.. అదే.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండును కార్మిక సంఘాలు వదలుకోవాలన్నదే ఆ షరతు. డిమాండ్లను పరిశీలించడానికి ఆర్టీసీ ఇ.డి.లతో ఆర్టీసీ ఎండి కమిటీని కేసీఆర్ నియమించారు. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా హైకోర్టుకు నివేదిక సమర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం ప్రగతి భవన్ లో అధికారులతో సమీక్ష జరిపారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ముఖ్య కార్యదర్శులు సునిల్ శర్మ, నర్సింగ్ రావు, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, రవాణా కమిషనర్ సందీప్ సుల్తానియా, ఇడిలు పాల్గొన్నారు. కార్మికులు లేవనెత్తిన డిమాండ్లలో 21 అంశాలను పరిశీలించాలని కోర్టు కోరింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ ఆ డిమాండ్లు పరిశీలించాలని కేసీఆర్ నిర్ణయించారు.

ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆర్టీసీ ఎండిగా వ్యవహరిస్తున్న రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునిల్ శర్మ ఆరుగురు అధికారులతో కమిటీ వేశారు. ఇడి. టి. వెంకటేశ్వర్ రావు అధ్యక్షుడిగా ఇడిలు ఎ. పురుషోత్తం, సి. వినోద్ కుమార్, ఇ.యాదగిరి, వి.వెంకటేశ్వర్లు, ఆర్థిక సలహాదారు ఎన్.రమేష్ లు సభ్యులుగా కమిటి ఏర్పడింది. హైకోర్టు సూచించిన 21 అంశాలను పరిశీలించి, ఒకటి రెండు రోజుల్లో కమిటీ తన నివేదికను ఆర్టీసీ ఎండికి అందిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news