మంగళగిరిలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ మకాం..

-

జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. నేడు, రేపు మంగళగిరిలోనే ఉండనున్నారు. ఈ మధ్యాహ్నం మంగళగిరి సమీపంలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకోనున్న ఆయన, రెండు రోజుల పాటు పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఇక గత ఎన్నికల్లో జనసేన ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ పవన్ కల్యాణ్ ఓడిపోగా, కేవలం ఒకే ఒక్క అసెంబ్లీ సీటు దక్కింది.

ఇక ఎన్నికల తరువాత జరిగిన పరిణామాలు, పార్టీ నుంచి వీడిన నేతలు, తదుపరి కార్యాచరణ తదితర అంశాలపై ఆయన నేడు సమీక్షా సమావేశాలు జరుపుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తిరిగి ఎన్నికలు రావడానికి చాలా సమయం ఉన్నందున, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు, అభిమానులను నిలుపుకునేందుకు సినిమాల్లో తిరిగి నటించాలా? అన్న విషయంపైనా పవన్, తన అనుచరులు, కార్యకర్తలతో చర్చిస్తారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news