బిస్కెట్లు ఆశ చూపి..మనవరాలి మీద తాత అత్యాచారం

-

ఈ మధ్య కాలంలో మనుషుల మధ్య వావి వరసలు లేకుండా పోతున్నాయి. చెల్లెలి మీద అన్నలు, కూతుళ్ళ మీద తండ్రులు, మనవరాళ్ల మీద తాతలు ఇలా చెప్పుకుంటూ పోతే గుండెల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన వారే గుండెల్లో గుచ్చె పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సాధారణంగా ఆడపిల్లలకి బయటి వారి నుంచి ఏదైనా ఆపద వస్తుందని భావిస్తుంటారు. కానీ సొంత ఇంట్లోనే కామాంధులు ఉంటున్న విషయాన్ని పసిగట్టడానికి లేట్ అవుతోంది.

తాజాగా ఇలాంటి ఘటన ఒకటి తిరుపతిలో చోటు చేసుకుంది.. తిరుపతిలోని నాగాపురంలో దారుణ ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సొంత మనవరాలిపైనే తాత అత్యాచారం చేశాడు. బిస్కెట్లు కొనిస్తానని ఆశ చూపి సొంత మనవరాలు మీద శివలింగం అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. తీవ్రగాయాలతో రక్తస్రావం అవుతున్న బాలికను ఆసుపత్రికి తరలించారు తల్లితండ్రులు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి శివలింగాన్ని అదుపులోకి తీసుకున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news