రాజన్న రాజ్యం అంటే ఏపీకి వెళ్ళాలి – షర్మిలపై గుత్తా సెటైర్లు

-

రాజన్న రాజ్యం అంటే ఏపీకి వెళ్ళాలని షర్మిలపై గుత్తా సుఖేందర్‌ సెటైర్లు వేశారు. షర్మిల రాజన్న రాజ్యం అంటే అసలు తెలంగాణ వచ్చేది కాదని మండిపడ్డారు. షర్మిల ను ఎవరు పట్టించుకుoటారని ఎద్దేవా చేశారు. TRS ఎమ్మెల్యేలను చీల్చిన.. పాస్పోర్ట్ కావాలన్నది వైఎస్ అని ఫైర్‌ అయ్యారు. రాజన్న రాజ్యం అంటే ఏపీకి వెళ్ళాలన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి.

రాజ్యాంగ బద్ధ పదవుల్లో ఉన్న వాళ్ళు హుందాగా ఉండాలని చురకలు అంటించారు. నేనైనా… గవర్నర్ ఐనా అది కాపాడుకోవాలని.. ఆమె పరిధిలో ఆమె ఉండాలని హెచ్చరించారు. గవర్నర్ రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు.

మునుగోడు లో పోటీ పై పార్టీ నాతో ఎవరు మాట్లాడలేదని… సీఎం కెసిఆర్ నాతో మాట్లాడితే చెప్తానని స్పష్టం చేశారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌ రెడ్డి. నేను మండలి చైర్మన్ పదవీ లో సంతృప్తిగా ఉన్నానని.. సర్వే లు బీజేపీ పుంజుకున్నా …టీఆర్ఎస్దే అధికారం అని చెప్పాయని వెల్లడించారు. కేంద్రం పై సీఎం గట్టిగా మాట్లాడినా, అన్ పార్లమెంటరీ మాట్లాడబోరని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news