BREAKING : శాసన మండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఎన్నిక

-

తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్‌గా టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎన్నికయ్యారు. శాసనమండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎన్నికవడం ఇది రెండోసారి. గుత్తా సుఖేందర్ రెడ్డి ఒక్కరే నామినేషన్ వేయడంతో తెలంగాణ కౌన్సిల్ చైర్మన్ గా ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.

అనంతరం చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఆయనకు తెలంగాణ మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, కల్వకుంట్ల తారక రామారావు, మహమ్మద్‌ అలీ, శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా తెలంగాణ మంత్రులు… ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి.. సేవలను కొనియాడారు. కాగా.. ఇటీవలే ఆయన ఎమ్మెల్సీ గా ఎన్నికలయ్యారు. 2019 లో ఎమ్మెల్సీ గా ఎన్నికైన గుత్తా సుఖేందర్‌ రెడ్డి…. 2021 లో పదవీ కాలం ముగియడంతో.. ఆయన రాజీనామా చేశారు. ఇక ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన ఏకగ్రీవంగా గెలుపొందారు.

Read more RELATED
Recommended to you

Latest news