బాబుగారికి బిల్డప్ ఎక్కువ … తక్కువ

-

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై జీవీఎల్ మరో సారి ఫైర్ అయ్యారు. తాత్కాలిక నిర్మాణాలకు ఫేమస్ అయిన చంద్రబాబు…ఉత్తుత్తి స్టీల్‌ ప్లాంటుకు శంకుస్థాపన చేసి మరొక డ్రామాకు తెరలేపారని ఆయన విమర్శించారు. ఈ మేరకు బాబుపై జీవీఎల్‌ ట్విటర్‌లో …. రాయేగా పోయేదేముందని శంకుస్థాపన చేశారని వ్యంగంగా పోస్ట్ చేశారు. అమలుకు నోచుకోని ‘చంద్రన్న శంకుస్థాపన రాళ్లు’ రాయలసీమలో చాలా ఉన్నాయని వ్యాఖ్యానించారు.  చంద్రబాబు పాలనలో పని తక్కువ.. మోసం, ఆర్భాటం ఎక్కువని విమర్శించారు. స్టీల్‌ప్లాంట్‌ విషయంలో చంద్రబాబు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనన్నారు.

ఒక రాయి పడేసి రాయలసీమను ఉద్ధరిస్తున్నట్లు పెద్ద బిల్డప్‌ ఇస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. కేంద్రం చేస్తున్న సాయాన్ని ఏమాత్రం రాష్ట్ర ప్రజలకు తెలియనీయకుండా పనికిమాలిన జిత్తులు వేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇక రాష్ట్ర ప్రజలు చంద్రబాబుని పక్కన పెట్టడం ఖాయమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news