కార్తికేయ 2 సినిమా స్ట్రాటజీ ఫాలో అవుతున్న హనుమాన్ టీం..!!

-

యంగ్  హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో ప్రశాంత్ వర్మ  తెరకెక్కిస్తోన్న మరో చిత్రం హను-మాన్. . ఇటీవల విడుదలైన ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంటూ మంచి వ్యూస్ సాధిస్తోంది. చాలా మంది నుండి ప్రశంశలు వస్తున్నాయి.

ఇక ఈ సినిమా హీరో మరియు దర్శకుడు అచ్చం కార్తికేయ 2 సినిమా స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. ఆ సినిమా కృష్ణ దేవుని పై తీస్తే ఈ సినిమా ను హనుమంతుడి మీద తీశారు. అసలే ఉత్తర భారతదేశంలో విపరీత మైన భక్తి కలిగి ఉంటారు. వాస్తవానికి ప్రశాంత్ వర్మ కు కార్తికేయ 2 సినిమా తెచ్చిన వసూళ్ల ను చూసి నమ్మకంతో బడ్జెట్ ఎక్కువ పెట్టడానికి దైర్యం కలిగింది. అలాగే వారిలాగా వీరు కూడా గుళ్ల సందర్శన కూడా పెట్టుకున్నారు.

రీసెంట్ గా దర్శకుడు ప్రశాంత్ వర్మ , హీరో తేజ సజ్జాతో సహా హను-మాన్ టీమ్ శ్రీరాముని ఆశీర్వాదం కోసం అయోధ్య ఆలయాన్ని సందర్శించింది. టీజర్‌ కి వచ్చిన రెస్పాన్స్‌తో ఆనందంలో ఉన్న టీమ్, అయోధ్యను సందర్శించిన తర్వాత అధికారకంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు.అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ క్రేజీ పాన్ ఇండియా చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌ టైన్‌ మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news