విజయదశమి కానుకగా ‘హరిహర వీరమల్లు’.. ఆనందంలో పవన్ అభిమానులు..

-

జనసేనాని పవన్ కల్యాణ్ ప్రజెంట్ సినిమాలు, రాజకీయం రెండూ చేస్తు్న్నారు. సినిమా భాషలో చెప్పాలంటే ఆయన జోడు గుర్రాల స్వారీ చేస్తున్నారనొచ్చు. ‘వకీల్ సాబ్’ చిత్రం తర్వాత వరుస సినిమాలకు ఓకే చెప్పిన పవర్ స్టార్.. షూటింగ్స్‌లో ఫుల్ బిజీగా ఉంటూనే పొలిటికల్ మీటింగ్స్ కూడా పెడుతూ రాజకీయాల్లో ఉన్నారు. ఇటీవల పవన్ కల్యాణ్ నటించిన ‘భీమ్లానాయక్’ చిత్రం విడుదలై సూపర్ సక్సె్స్ అయింది. ప్రస్తుతం ఆ ఫిల్మ్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. ఇక ఆయన నటిస్తున్న నెక్స్ట్ సినిమాల అప్ డేట్స్ గురించి ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తు్న్నారు.

 

పవన్ కల్యాణ్ – క్రిష్ కాంబోలో వస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘హరిహర వీరమల్లు’. మెఘలుల కాలం నాటి కథను క్రిష్ తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆనాటి కట్టడాల కోసం భారీ సెట్లు నిర్మిస్తున్నారు. ఇందులో కథనాయికగా నిధి అగర్వాల్ నటిస్తుండగా, మరో కీలక పాత్రను జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ యాభై శాతం పూర్తయింది. కరోనా ప్రభావం వలన షూటింగ్ ఆగిపోయింది. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేయాలని ప్రొడ్యూసర్, మేకర్స్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ మూవీని ఈ ఏడాది విజయ దశమి కానుకగా అక్టోబర్ 5న విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే చాన్స్ ఉందని వినికిడి. ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత పవన్ కల్యాణ్ హరీశ్ శంకర్‌తో ‘భవదీయుడు భగత్ సింగ్’, సురేందర్ రెడ్డితో ‘యథా కాలం తథా వ్యవహారం’ చిత్రాల్లో నటించనున్నారు. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ తర్వాత హరీశ్ శంకర్‌తో పవన్ కల్యాణ్ సినిమా చేస్తున్నాడు. దాంతో ఈ పిక్చర్ పైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇందులో హీరోయిన్‌గా టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news