డబుల్ ఇంజిన్ పెద్ద ట్రబుల్ ఇంజిన్ : మంత్రి హరీశ్ రావు

-

డబుల్ ఇంజిన్ పెద్ద ట్రబుల్ ఇంజిన్ అని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తో తెలంగాణలో అభివృద్ధి పరుగులు పెట్టిస్తామని కొందరు మాట్లాడుతున్నారని.. కానీ డబుల్ ఇంజిన్ తో పెద్ద ట్రబుల్ అని అన్నారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని కళాభవన్‌లో ఏర్పాటు చేసిన ఏఎన్ఎంల 2వ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొవిడ్ సమయంలో ఏఎన్ఎంలు చేసిన విశేష సేవలకు అభినందనలు తెలిపారు. అందరూ కలిసి ఆరోగ్య తెలంగాణను నిర్మించాలని సూచించారు.

రెండు మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా గర్భిణుల కోసం  58 టిఫా స్కానింగ్‌ కేంద్రాలు ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. ఏఎన్ఎం కేంద్రాలను పల్లె దవాఖానాలుగా మారుస్తున్నట్టు వెల్లడించారు. 2014లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30శాతం డెలివరీలు అయ్యేవని ప్రస్తుతం అవి 67 శాతానికి పెరిగాయని వివరించారు. ఇందులో ప్రతి ఒక్కరి కష్టం ఉందన్న మంత్రి.. మెరుగైన వైద్యం అందించేందుకు ఏఎన్ఎంలు కృషి చేస్తున్నారని తెలిపారు. వారి సమస్యల పరిష్కారానికి తామూ కృషి చేస్తామని మంత్రి హరీశ్‌రావు ఏఎన్‌ఎంలకు హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news