భారత మార్కెట్ కు హార్లీ డేవిడ్సన్ గుడ్ బై !

-

లగ్జరీ బైక్​లు అనగానే భారత్​లో ఎక్కువగా గుర్తొచ్చే పేరు హార్లీ డేవిడ్​సన్. అంతలా దేశీయ మార్కెట్​లో పేరు తెచ్చుకున్న హార్లీ ఇప్పుడు షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనాతో విధించిన లాక్​డౌన్ సహా.. డిమాండ్ లేమితో ఇటీవల బైక్​ల విక్రయాలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. ఈ నేపథ్యంలో భారత కార్యకలాపాల నుంచి వైదొలగాలని హార్లీ డేవిడ్​సన్​ భావిస్తున్నట్లు సమాచారం. భవిష్యత్​ అంచనాలు కూడా ఆశించినంతగా లేకపోవడం ఇందుకు కారణమనే వార్తలు వస్తున్నాయి.

 Harley Davidson

Harley Davidson

కంపెనీకి హరియాణాలో ఉన్న ప్లాంట్​ను మూసేసి.. ఔట్​ సోర్సింగ్​కు అసెంబ్లింగ్ విభాగ కార్యకాలాపాలు అప్పగించాలని యోచిస్తున్నట్లు తెలిసింది.హార్లీ డేవిడ్​సన్​ గత ఆర్థిక సంవత్సరం దేశీయంగా 2,500కు పైగా బైక్​లను విక్రయించింది. ఈ ఆర్థిక సంవత్సరం విషయానికొస్తే.. ఏప్రిల్-జూన్​ మధ్య 100 బైక్​లు మాత్రమే విక్రయించింది.ప్రపంచవ్యాప్తంగా అత్యంత తక్కువగా విక్రయాలు ఉన్న మార్కెట్లలో భారత్ కుడా ఒకటని హార్లీ గతంలోనే ప్రకటించింది. అలాంటి మార్కెట్ల నుంచి వైదొలగాలని యోచిస్తున్నట్లు కూడా అప్పట్లో సంకేతాలు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news