క్షీణించిన హత్రాస్ యువతి తల్లితండ్రుల ఆరోగ్య పరిస్థితి

-

హత్రాస్ యువతి కేసుని టేకప్ చేసిన సీబీఐ దర్యాప్తుని వేగవంతం చేసింది. ఈరోజు మధ్యాహ్నం కేస్ ని డీల్ చేసిన పోలీసులు, ఫోరెన్సిక్ బృందంతో హత్రాస్ చేరుకున్న అధికారులు, ఘటనా జరిగిందని చెబుతోన్న ప్రాంతంలో దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి సోదరుడి వివరాల ప్రకారం వ్యవసాయ క్షేత్రంలోని ఘటనా ప్రాంతంలో దర్యాప్తు ప్రారంభించారు.

అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకోని తిరిగి వస్తున్న యువతి తల్లిని కూడా, సంఘటనా స్థలానికి తీసుకెళ్లారు. ఆ రోజు అక్కడ ఏం జరిగిందో ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. అలానే హత్రాస్ బాధితురాలి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించారు సీబీఐ అధికారులు. అయితే యువతి తల్లిదండ్రులకు ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు నిర్ధరించారు. దీంతో ఆసుపత్రిలో చేర్చడానికి యత్నించగా చేరేందుకు యువతి తండ్రి నిరాకరించగా, ఆమె తల్లి మాత్రం ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news