తాయత్తు మహిమతోనే నేను ఈ స్థాయిలో ఉన్నా : DH శ్రీనివాస్‌‌రావు వివాదాస్పద వ్యాఖ్యలు

-

తాయత్తు మహిమతోనే నేను ఈ స్థాయిలో ఉన్నానని DH శ్రీనివాస్‌‌రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొత్తగూడెం క్లబ్ లో డా. జీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈయొక్క కార్యక్రమంలో రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు పాల్గొని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ముస్లింలను ఉద్దేశించి మాట్లాడుతూ…. అన్ని మతాల్లో కూడా అందరూ కలిసిమెలిసి ఉండాలని, ఒకరితో ఒకరు ప్రేమగా మెలగాలని చెప్పాయని అన్నారు.


భూమిపై విర్రవీగుతూ అహంకారం తో నేలను చీల్చలేవు, పర్వతాలను తాకలేవు అని ఖురాన్ చెప్పింది అని అన్నారు. ఖురాన్ ఒక గొప్ప గ్రంధమని, ఇప్పటికి తెలుగులో ఉన్న ఖురాన్ ను నేను పటిస్తూ ఉంటానని అన్నారు. నా చిన్న తనంలో జబ్బు చేసి హాస్పిటల్ కు వెళ్లిన క్రమంలో డాక్టర్లు సైతం చేతులు ఎత్తేయగ నా తల్లిదండ్రులు ఒక మసీదులో తాయత్తు కట్టిస్తే అయొక్క తాయత్తు మహిమ వల్ల నేను బ్రతికానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఇప్పుడున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. ముఖ్యంగా గత వారం రోజుల నుండి అత్యంత బాధాకర సంఘటనలు జరిగాయని, ఒక వర్గం పై దాడులు జరగడం అన్యాయం అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news