ముంబాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టివేత

-

ముంబాయి: ముంబాయి అంతర్జాతీయ విమానాశ్రయం లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. జింబాబ్వే ప్రయాణికురాలి వద్ద 60 కోట్ల విలువ చేసే 8586 గ్రాముల హెరాయిన్ సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. జింబాబ్వే హరారే నుండి ఢిల్లీ చేరుకున్న ఓ లేడి కిలాడి వద్ద డ్రగ్స్ గుర్తించారు కస్టమ్స్ అధికారులు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా హెరాయిన్ ను ట్రాలీ బ్యాగ్ తో పాటు ఫైల్ ఫోల్డర్ లో దాచి తరలించే యత్నం చేసింది కిలాడి లేడి.

ఎయిర్ పోర్ట్ లో లేడి కిలాడి పై అనుమానం కలగడంతో అదుపులోకి తీసుకొని విచారణ చేసింది కస్టమ్స్ బృందం. అధికారులు నిర్వహించే స్కానింగ్ కు చిక్కకుండా హెరాయిన్ ప్లాస్టిక్ కవర్స్ లో ప్యాకింగ్ చేసి. ట్రాలీ బ్యాగ్ ఫైల్ ఫోల్డర్ లో దాచింది కిలాడి లేడీ.

కస్టమ్స్ అధికారులు పలు సార్లు ప్రశ్నించినా నోరు మెదపని కిలాడి… తమ దైన స్టైల్ లో విచారణ చేసిన కస్టమ్స్ బృందం. ట్రాలీ బ్యాగ్, ఫైల్ ఫోల్డర్ ను పూర్తిగా పగలగొట్టారు అధికారులు. ట్రాలీ బ్యాగ్, ఫైల్ ఫోల్డర్ లో దాచిన డ్రగ్స్ గుట్టను రట్టు చేశారు కస్టమ్స్. ప్రయాణికురాలి పై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news