హైపర్ ఆది క్రేజ్ చూసి షాక్ లో హీరో ధనుష్..!

-

జబర్దస్త్ ద్వారా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హైపర్ ఆది ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ మరింత పాపులారిటీ దక్కించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆయన సూపర్ స్టార్ ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న సార్ సినిమాలో హీరో ధనుష్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో ఫుల్ లెన్త్ క్యారెక్టర్ పోషించారు.. అందుకే సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో కూడా అతడు కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఆ మధ్య ధనుష్ సార్ మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి హైదరాబాద్ వచ్చిన సమయంలో కూడా హైపర్ ఆది క్రేజ్ ఏంటో తెలుసుకున్నాడు ధనుష్.

తాజాగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో హైపర్ ఆది గురించి ధనుష్ ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. ఇతనికి ఇంత క్రేజీ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు అంటూ జనాల నుండి వస్తున్న స్పందన చూసి ఆశ్చర్యపోతూ షాకింగ్ కామెంట్లు చేశారు.. సినిమాలు తక్కువనే చేసినా కూడా ఈ స్థాయి క్రేజ్ ఎందుకు వచ్చింది అనేది అర్థం కావడం లేదని ధనుష్ వ్యాఖ్యలు చేయగా ..వెంటనే దర్శకుడు త్రివిక్రమ్ స్పందిస్తూ అతడు ఒక బుల్లితెర పాపులర్ కామెడీ షోలో చాలా కాలంగా చేస్తున్నాడు.. నటుడిగా, రైటర్గా, అద్భుతమైన కామెడీని పండించే వ్యక్తి ఆయన .. అందుకే ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఉందని ధనుష్ కి త్రివిక్రమ్ చెప్పాడు.. దాంతో జబర్దస్త్ కార్యక్రమాన్ని తప్పకుండా చూస్తానని ధనుష్ కూడా చెప్పాడు.

దీంతో హైపర్ ఆది అంటే ప్రత్యేక అభిమానం ధనుష్ కి ఏర్పడింది. అందుకే ఏకంగా జబర్దస్త్ కార్యక్రమాన్ని చూస్తానంటూ స్టేజిపై అందరి ముందు ధనుష్ చెప్పుకొచ్చాడు. ఇక ధనుష్ మాటలతో హైపర్ ఆది క్రేజ్ కూడా మరింత పెరిగిందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news