అభిమానులకు సర్ప్రైజ్ మెసేజ్ ఇచ్చిన హీరో ప్రభాస్

-

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నటించిన సినిమా కల్కి.600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీ.. జూన్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది.సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించాడు. వైజయంతి మూవీ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించారు.

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని, పశుపతి , రాజేంద్ర ప్రసాద్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. అవెంజర్స్ తరహాలో హాలీవుడ్ రేంజ్‌లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిందీ సైంటిఫిక్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది.ప్రస్తుతం కల్కి 2898 ఏడీ హిట్‌ను ఎంజాయ్ చేస్తోన్న హీరో ప్రభాస్ తన ఆనందాన్ని ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. కల్కిని సూపర్ హిట్ చేసినందుకు అభిమానులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. అభిమానులే లేకపోతే తాను జీరోనని అన్నారు.ఈ సినిమాను ఇంత అద్భుతంగా, హాలీవుడ్ రేంజ్‌లో తీర్చిదిద్దిన దర్శకుడు నాగ్ అశ్విన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. నాగ్ అశ్విన్..5 సంవత్సరాల పాటు ఓ యజ్ఞంలా ఈ సినిమాను చిత్రీకరించారని, అంతే అద్భుతంగా తెరకెక్కించారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news