ప్రభాస్​ వెల్​ కమ్​ చెప్పిన విధానం బాగుందన్న ముద్దు గుమ్మ…

-

టాలీవుడ్​ జనాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రాలలో ప్రభాస్​ prabhas నటిస్తున్న రాధే శ్యామ్ కూడా ఉంటుంది. కోవిడ్​ కారణంగా వాయిదా పడిన ఈ చిత్ర షూటింగ్​ జూన్​ 25 నుంచి తిరిగి మొదలైంది. ప్రస్తుతం ఈ మూవీ చివరి షెడ్యూల్​ ను షూట్​ చేస్తున్నారు. అలనాటి బాలీవుడ్​ ముద్దుగుమ్మ భాగ్యశ్రీ ఈ మూవీలో కీ రోల్​ పోషిస్తుంది. హిందీలో మైనే ప్యార్ కియా వంటి ఎన్నో హిట్​ చిత్రాలలో నటించింది భాగ్యశ్రీ. తాజాగా రాధే శ్యాం సెట్​ లో అడుగు పెట్టిన భాగ్య శ్రీకి స్వీట్లు బహుమతిగా ఇచ్చి… సర్​ ప్రైజ్​ చేశాడు ప్రభాస్​. ఇందుకు ఉబ్బిపోయిన భాగ్యశ్రీ ప్రభాస్​ కు సోషల్​ మీడియా వేదిక ట్విటర్​ ద్వారా ధన్యవాదాలు తెలిపింది.. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రేమ కావ్యం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రభాస్​/ prabhas
ప్రభాస్​/ prabhas

అందాల భామ భాగ్యశ్రీ మూవీలో తన పార్ట్​ షూటింగ్​ కంప్లీట్​ చేయడం కోసం హైదరాబాద్​ లో అడుగు పెట్టింది. షూటింగ్​ లొకేషన్​ లోకి ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీకి ప్రభాస్​ అందించిన గిఫ్ట్​ అదిరిపోయిందట. దానికి సంబంధించిన ఫొటోలను ఈ సీనియర్​ హీరోయిన్​ ట్విట్టర్ లో పంచుకుంది. తనకు మరిచిపోలేని గిఫ్ట్​ అందించినందుకు రెబల్​ స్టార్​ కు ధన్యవాదాలు తెలిపింది. ఆనందంలో మునిగి తేలుతూ… ట్విటర్​ లో ఇలా రాసుకొచ్చింది. రుచికరమైన హైదరాబాద్ స్వీట్లు అందజేసినందుకు డార్లింగ్​ ప్రభాస్​ ను అభినందించింది ఈ ముద్దు గుమ్మ.

మరో పోస్ట్ లో భాగ్యశ్రీ తన అభిమానుల కోసం రాధే శ్యామ్ సెట్స్ లో తీసిన ఫొటోను పోస్ట్​ చేసింది. ఈ ఫొటోలో భాగ్యశ్రీ చీర కట్టులో మెరిసిపోతున్నారు. ఆ ఫొటోను పోస్ట్ చేస్తూ… షూటింగ్​ షురూ కరే అంటూ ఈ నటి రాసుకొచ్చింది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన రాధే శ్యామ్ లో అందాల బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రభాస్​ సరసన నటిస్తోంది. అందమైన ప్రేమ కావ్యంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. తెలుస్తున్న దాని ప్రకారం సినిమా మొత్తం యూరప్​ లోనే ఉంటుందట. అంతేకాకుండా ఈ చిత్రంలో కృష్ణం రాజు, సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి, భాగ్యశ్రీ, మురళీ ధరమ్ మరియు సత్యన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news