ఆడపిల్లకు జన్మనిచ్చిన టాలీవుడ్ నటి

-

సినీ నటి మనాలీ రాఠోడ్ తల్లయ్యారు. పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చారు. గ్రీన్ సిగ్నల్’, ‘ఓ స్త్రీ రేపు రా’, ‘నేను లోకల్‌’, ‘ఫ్యాషన్‌ డిజైనర్‌’, ‘హౌరా బ్రిడ్జ్‌’, ‘ఎంఎల్‌ఏ’ వంటి చిత్రాల ద్వారా సిల్వర్‌ స్క్రీన్‌పై మెరిసిన హైదరాబాదీ అమ్మాయి మనాలీ. ఈమె 2019 నవంబర్ నెలలో విజిత్ వర్మను వివాహం చేసుకున్నారు.

విజిత్ వ‌ర్మ‌ బీజేపీ నాయకుడు. కాగా వీరిది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం. ఆ మ‌ధ్య కాలంలో మ‌నాలీ ప్రెగ్నెంట్ గా ఉన్న పొటోలు సోష‌ల్ మీడియాలో సంద‌డి చేసిన విషయం తెలిసిందే! కాగా మ‌నాలీ ఇటీవలే పాపాయికి జ‌న్మ‌నిచ్చింది. జూలై 18న ఆమె పాప‌కి జ‌న్మ‌నివ్వ‌గా ..ఈ విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. దాంతో మ‌నాలీకి అంద‌రూ కంగ్రాట్స్ తెలియ‌జేస్తున్నారు.

వివాహం అనంతరం కూడా మనాలీ పలు చిత్రాల్లో నటించారు. తనకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు షేర్ చేసుకునే మనాలీ.. తాను తల్లిని కాబోతున్నట్లు గతేడాది తెలిపారు. ఇప్పుడు పండంటి క్యూటీకి జన్మనిచ్చారు. తన బిడ్డ తన కెరీర్‌కు అడ్డుకాదని.. త్వరలోనే మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై కనిపిస్తానని మనాలీ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news