షాద్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత.. ఉరి తీయాల్సిందే అంటూ డిమాండ్..

-

వైద్యురాలి హత్య ఘటనపై షాద్‌నగర్ అట్టుడికిపోతోంది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలోనే షాద్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రియాంక హత్య కేసులో నిందితులను ఉరి తీయాలంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం ప్రియాంక హత్య కేసులో నిందితులు షాద్‌నగర్‌ పీఎస్‌లో ఉన్నారు. అయితే నిందితులను తమకు అప్పగించాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

వీరిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు హత్యాచార ఘటనపై తెలుగు రాష్ట్రాల్లోని మహిళా, ప్రజాసంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. నిందితులను ఉరితియ్యాలంటూ పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు చేపట్టాయి.

Read more RELATED
Recommended to you

Latest news