ఓటిటి లోకి బ్లాక్ బస్టర్ మూవీ … రికార్డులు సృష్టించేనా !

-

ఓంకార్ తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చిన అశ్విన్ బాబు నెమ్మదిగా హీరోగా నిలదొక్కుకోవడానికి తన ప్రయత్నం చేస్తున్నాడు. కెరీర్ లో ఇప్పటి వరకు కొన్ని సినిమాలు చేసినా వాటిలో చాలా తక్కువ మాత్రమే ఇతనికి యావరేజ్ ఫలితాన్ని అందించినా, నటుడిగా మాత్రం మంచి మార్కులు సంపాదించలేకపోయాయి. అయినప్పటికి వరుసగా మంచి మంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇక ఈ మధ్యన థియేటర్ లలో విడుదల అయిన హిడింబ మూవీతో వచ్చి బ్లాక్ బస్టర్ టాక్ ను దక్కించుకున్నాడు, ఇందులో అశ్విన్ బాబు కు సరసన నందిత శ్వేతా నటించగా, కన్నెగంటి అనిల్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాను ఆగష్టు 10వ తేదీ అనగా రేపు రాత్రి 7 గంటలకు ఓటిటి లో విడుదల చేయనున్నారు.

ఈ సినిమా రేపు సాయంత్రం నుండి ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది. మరి థియేటర్ లలో తన సత్తా చాటిన హిడింబ ఓటిటి లోనూ రెకార్డ్ సృష్టిస్తుందా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news