ఇండియాలో హై అలెర్ట్

-

దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున బాంబ్ బ్లాస్ట్ కావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ దెబ్బతో దేశమంతా హైలెట్ ప్రకటించారు. ఈరోజు గణతంత్ర దినోత్సవానికి సంబంధించి బీటింగ్ రిట్రీట్ ముగింపు రోజు కావడంతో సాయంకాలం ఢిల్లీ ప్రజలంతా దానిని తిలకిస్తున్నారు. ఈ సమయంలో ఇజ్రాయిల్ దేశం దౌత్య కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఒక రోడ్ డివైడర్ వద్ద బ్లాస్టింగ్ జరిగింది..

ఈ బ్లాస్టింగ్ లో చుట్టుపక్కల పార్క్ చేసి ఉన్న కొన్ని కార్ల అద్దాలు పగిలిపోయాయి. అయితే ఇది ఎవరి పని అనేది పోలీసులు తేల్చే పనిలో ఉన్నారు.. అయితే ముందస్తు జాగ్రత్తగా దేశంలో ఉన్న అన్ని ఎయిర్పోర్ట్స్, ప్రభుత్వ భవనాలు, అలాగే సున్నిత ప్రాంతాలలో,మెట్రో, బస్ స్టేషన్ తదితర ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేయాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశారు. ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టాలని కేంద్ర హోంశాఖ పేర్కొంది.

 

Read more RELATED
Recommended to you

Latest news