పునీత్ రాజ్ కుమార్ మృతి..బెంగుళూరు లో హై అలర్ట్..!

-

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మృతిచెందారు. ఈరోజు ఉదయం 11:30 నిమిషాలకు పునీత్ రాజ్ కుమార్ కు గుండెపోటు రావడంతో ఆయన ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అప్పటికే ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు నిర్ధారించారు. కాగా తాజాగా పునీత్ రాజ్ కుమార్ మృతి చెందినట్టు తెలుస్తోంది. పలువురు సినీ ప్రముఖులు పునీత్ రాజ్ కుమార్ కు నివాళులు అర్పిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే బెంగళూరు నగరంలో హైఅలర్ట్ ప్రకటించారు. పునీత్ రాజ్ కుమార్ మృతి కారణంగా అభిమానులు ప్రేక్షకులు పెద్ద ఎత్తున బయటికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా రెండు రోజుల పాటు పాఠశాలలు కాలేజీలకు కర్ణాటక ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.puneeth rajkumar

కేవలం బెంగళూరులో మాత్రమే కాకుండా కర్ణాటక రాష్ట్రం మొత్తం హైఅలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్లను రెండు రోజులపాటు మూసి వేయాలని నిర్ణయం తీసుకున్నారు. బెంగళూరు మహా నగరం లోని అన్ని బార్డర్ ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి అలర్ట్ ప్రకటించారు. ఇదిలా ఉంటే పునీత్ రాజ్ కుమార్ కన్నడ పవర్ స్టార్ గా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. దాదాపు 29 సినిమాల్లో ఆయన హీరోగా నటించి ప్రేక్షకులను అలరించారు. అంతేకాకుండా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news