ప‌ద్మావ‌తి నిల‌యంలో బాలాజి జిల్లా క‌లెక్టరేట్ ఏర్పాటుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

-

అమరావతి : తిరుపతి ప్రజలకు ఏపీ హై కోర్టు శుభవార్త చెప్పింది. టీటీడీ పాలక మండలికి చెందిన పద్మావతి నిలయం భవనంలో కొత్తగా ఏర్పాటు కాబోయే బాలాజీ జిల్లా కలెక్టరేట్ ఏర్పాటుకు ఏపీ హై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లా కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ పై స్టే ఇస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం అప్పీల్చేసింది.

అయితే దీనిపై సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొట్టేసింది అంధ ప్రదేశ్ రాష్ట్ర ఉన్నత ధర్మా సనం. అంతే కాదు పద్మావతి నిలయం భవనంలో కలెక్టరేట్ ఏర్పాటుకి అనుమతి ఇచ్చింది ఏపీ హై కోర్టు. కలెక్టరేట్ ఏర్పాటు కోసం భవనం అకృతుల్లో ఎలాంటి మార్పులు చేయవద్దని స్పష్టం చేసిన ధర్మాసనం… పద్మావతి నిలయం భవనంలో కలెక్టరేట్ ఏర్పాటుకి అనుమతి ఇచ్చింది. దీంతో ఏపీ సర్కార్ కు భారీ ఊరట లభించింది.

Read more RELATED
Recommended to you

Latest news