అర్ధరాత్రి హైడ్రామా.. కళా అరెస్ట్, విడుదల

-

రామతీర్థంలో మొదలైన రాజకీయ రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్న అర్ధరాత్రి తెలుగుదేశం పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ని అరెస్ట్ చేసి కొద్దిసేపటికి విడుదల చేయడం కలకలం రేపింది. రామతీర్థంలో చంద్రబాబు పర్యటిస్తున్నా అని ప్రకటించిన అనంతరం అక్కడికి వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా పరిశీలించేందుకు వెళ్లారు. అయితే ఆ సమయంలో విజయసాయిరెడ్డి వాహనం మీద గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అయితే ఈ దాడి చేయించింది కళా వెంకట్రావు అని తనను చంపేందుకు యత్నించారు అని సాయి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో పోలీసులు నిన్న కళావెంకట్రావు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ వెంటనే విచారించి వదిలేశారు. ఈ కేసుకు సంబంధించి ఆయన అనుచరులు ప్రధాన నిందితులుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ అరెస్ట్‌పై ఎస్పీ రాజకుమారి స్పందించారు.. విజయసాయిరెడ్డి ఈ నెల 2న విజయనగరం జిల్లా నెల్లిమర్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చారని ఆ కేసు నిమిత్తం విచారణ కోసం కళా వెంకట్రావును హాజరుకావాలని పలుమార్లు కోరీనా  సరిగా స్పందించకపోవడంతో పిలిచి విచారించి తర్వాత నోటీస్ ఇచ్చి తిరిగి పంపించామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news