ఏపీలో బీజేపీ నేతల వరుస అరెస్ట్ లు..

-

విజయవాడ చేరుకున్న ఏపీ బీజేపీ నేతలు అందరిని ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు విజయవాడ పోలీసులు. ఈ రోజు బిజెపి నిరసనల ప్రకటనతో ముందస్తుగా పోలీసులు బిజెపి నేతలను అరెస్టు చేస్తున్నట్టు చెబుతున్నారు. విగ్రహాల ధ్వంసంలో బీజేపీ నాయకుల పాత్ర కూడా ఉందని ఇటీవల డిజిపి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే బిజెపి పాత్రపై నిన్నటి సాయంత్రంలోగా డిజిపి వివరణ ఇవ్వాలని నేతలు డెడ్ లైన్ విధించారు.

అయితే దీనికి సంబంధించి డిజిపి స్పందించకపోవడంతో బిజెపి నిరసనకు సిద్ధమైంది. ఇప్పటికే బిజెపి నేతలు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ్, అలాగే విష్ణువర్ధన్ రెడ్డి విజయవాడ చేరుకున్నారు. డీజీపీ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగే అవకాశం ఉందని పోలీసులకు సమాచారం అందడంతో బిజెపి ముఖ్య నేతలనము ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు పోలీసులు. మరో పక్క ఈ రోజు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి రేషన్ డెలివరీ చేసే వాహనాలను బెంజ్ సర్కిల్ కేంద్రంగా ప్రారంభించనున్నారు.  దీంతో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news